- వహీద్ ఖాన్ మృతి
సంతాపం వ్యక్తం చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు
సిద్దిపేట, మార్చి 01(అవనివిలేకరి) సిద్దిపేట పట్టణానికి చెందిన సీనియర్ రాజకీయ నాయకులు, మైనార్టీ నేత వహీద్ ఖాన్ మృతి పట్ల మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తన సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి బాధాకరమని తనకు ఉన్న వ్యక్తి గత అనుబందాన్ని గుర్తు చేసుకున్నారు.ప్రజా సేవే లక్ష్యం గా నిత్యం ప్రజా సేవ సామాజిక సేవకు పాటుపడ్డారని, మైనార్టీ అభ్యున్నతికి కృషి చేసారని ఆయన సేవలను కొనియాడారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.