Latest News

ఘనంగా వృక్ష బంధన్

08 Aug, 2025 43 Views
Main Image
 
సిద్దిపేట అర్బన్,ఆగస్టు 08(అవని విలేకరి)రక్ష బందన్ సందర్బంగా స్థానిక అంబిటస్ పాఠశాలలో విద్యార్థినిలు  ఘనంగా వృక్ష బంధన్ కార్యక్రమం చేశారు. ప్రతి రోజు పాటశాల ఆవరణలో తమకు నీడను ఇస్తున్న వృక్షలకు రాఖీ కట్టిన విద్యార్థినీలు,ఆరు సంవత్సరాల క్రితం ఈ పాటశాలలో తాము నాటిన మొక్కలు చెట్లు అయి నేడు తమకు చల్లని నీడను ఇస్తున్నాయి అని విద్యార్థులు తెలిపారుఆలాగే చదువుల తల్లి సరస్వతి దేవి విగ్రహానీకి కుడా రాఖీ కట్టాము అని తెలిపారుఈ కార్యక్రమంలో పాఠశాల  ప్రధానోపాధ్యాయురాలు కరస్పాండెంట్,  ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి జ్యోతి  పాల్గొన్నారు.